byసూర్య | Sat, Apr 13, 2024, 02:11 PM
తెలంగాణ సెంటిమెంట్తో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన కారు పార్టీకి మూడోసారి తెలంగాణ ప్రజలు షాక్ ఇచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు.అయితే ఇదే విషయమై ఓ చానెల్ డిబేట్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీకి ఉనికి లేదనుకున్న హైదరాబాద్లో ఈ రోజు అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు తమకు ఓటు వేసి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు హైదరాబాద్లో ఇవ్వలేదన్నారు. ఈ విషయంలో ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజల కంటే కూడా తెలివైన వాళ్లని.. వారంతా చైతన్యవంతులు కాబట్టే సరైన నిర్ణయం తీసుకుంటురంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.