byసూర్య | Sat, Apr 13, 2024, 02:21 PM
జిల్లాలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వడ్డీ వ్యాపారంపై పోలీసులు కొరడా జులిపించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 70 చోట్ల దాడులు చేశారు. భూములు, ప్లాట్లు, బంగారం తనకగా పెట్టుకుని అడ్డగోలు వడ్డీకి అప్పులు ఇస్తున్నారు. ఈ దాడుల్లో 23 మంది అక్రమ వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి రూ. 49. 58లక్షల నగదుతో పాటు 157 గ్రాముల బంగారం, 315 ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.