byసూర్య | Sat, Apr 13, 2024, 02:25 PM
కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ పరిధిలో శుక్రవారం కల్లు డిపోలో తనిఖీలు చేసి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు బాన్సువాడ డిఎస్పి సత్యనారాయణ తెలిపారు. బిచ్కుంద మండలం పెద్దదేవడ గ్రామానికి చెందిన గంగాగౌడ్ అలియాస్ సతీష్ గౌడ్ కళ్ళు కాంపౌండ్ లో తనిఖీ చేసి 240గ్రాముల అల్ఫాజోలం, మిక్స్ట్ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. బైరి హన్మగౌడ్ దుకాణంలో 10 గ్రాముల అల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు.