byసూర్య | Sat, Apr 13, 2024, 02:28 PM
తాడ్వాయి మండల కేంద్రంలోని వైన్స్ షాప్ లో ఇష్టా రాజ్యాంగా కల్తీ మద్యం విక్రయిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజల ఆరోపిస్తున్నారు. అధికారులు, వైన్ షాప్ యజమానులు కుమ్మక్కై కల్తీ మద్యం విక్రయిస్తున్నారని వారు పేర్కొంటున్నారు. సదరు మద్యం షాపులో గోవా, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన బీర్లు అమ్ముతున్నారని, కామారెడ్డిలో కల్తీ మద్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారని వారు అంటున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.