byసూర్య | Sat, Apr 13, 2024, 02:44 PM
ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రఘునాధపాలెం మండలం జెడ్పీటీసీ మాలోత్ ప్రియాంక బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ కండువాను కప్పి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, ఎండీ జావేద్, ఎంపీపీ గౌరీ, తదితరులు ఉన్నారు.