byసూర్య | Sat, Apr 13, 2024, 02:59 PM
అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శనివారం అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాలను, గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు. గోదాంలలో ప్రమాదాలు జరగకుండా యజమానులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు.