byసూర్య | Sat, Apr 13, 2024, 03:03 PM
బాన్సువాడ పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో శనివారం బాన్సువాడ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాల గోడ ప్రతులను డి.ఎస్.పి సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు జాగ్రత్తగా వహించాలని, వారోత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి రాజిరెడ్డి, రవీందర్ గౌడ్, హరి సింగ్, తదితరులు పాల్గొన్నారు.