![]() |
![]() |
byసూర్య | Fri, Apr 12, 2024, 06:58 PM
కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ లో మరుగుదొడ్లకు హిందూ దేవతల పేరు పెట్టడాన్ని విశ్వహిందూ పరిషత్ శుక్రవారం అభ్యంతరం తెలిపింది. ఆర్టీసీ డిపోలో "మహాలక్ష్మి టాయిలెట్లు" అని పేరు పెట్టడం ఏంటని ఇది సమస్త హిందువులను కించపరిచినట్టేనని విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం డిపో మేనేజర్ ఇందిర దృష్టికి తీసుకెళ్లి వెంటనే తొలగించాలని డిమాండ్ చేయడంతో వెంటనే పేరును తొలగించడం జరిగింది.