byసూర్య | Fri, Apr 12, 2024, 04:42 PM
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం సమీపంలోని కీమ్యాతాండ వద్ద గురువారం రాత్రి మళ్లీ చిరుత పులి దూడపై దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన పర్ష అనే రైతు సమీపంలోని తన వ్యవసాయ పొలంలో పశువులను ప్రతినిత్యం లాగానే ఉంచడం జరిగింది అన్నారు. శుక్రవారం ఉదయం వెళ్లి చూడగా దూడపై చిరుత పులి దాడి చేసి చంపేసినట్లు తెలిపారు.