byసూర్య | Fri, Apr 12, 2024, 04:35 PM
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం లోని రాజాపూర్ గ్రామంలో వెలసిన గుంటి రంగనాథ స్వామి వారిని శుక్రవారం ఎమ్మెల్యే విజయుడు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతూ ఆలయంలోకి తీసుకెళ్లారు. పూజా కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్యేకు శాలువాకప్పి పూలమాల వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రమేష్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.