byసూర్య | Thu, Apr 11, 2024, 10:56 PM
ఖమ్మం రూరల్ ప్రాంతం అయినటువంటి గొల్లగూడం ఈద్గాలో గురువారం నిర్వహించిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనలలో ఖమ్మం జిల్లా పార్లమెంటు సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.