byసూర్య | Wed, Apr 10, 2024, 10:30 AM
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బొల్లారం మున్సిపాలిటీలో తనిఖీలను మంగళవారం ముమ్మరం చేశారు. సీఐ గంగాధర్ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది మున్సిపాలిటీ పరిధిలోని గండిగూడ రోడ్డులో వాహన తనిఖీలతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. పత్రాలు లేని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారికి చాలాన్లు వేశారు. ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక నిఘాతో తనిఖీలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.