ఒకేసారి 106 మంది ప్రభుత్వ ఉద్యోగాలపై వేటు.. ఆ మీటింగ్‌లో పాల్గొన్నందుకే

byసూర్య | Tue, Apr 09, 2024, 05:40 PM

లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ మీటింగులో పాల్గొన్న 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై ఒకేసారి వేటు పడింది. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. వీళ్లంతా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్నందుకు గానూ.. 106 మందిని సస్పెండ్‌ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు.


ఈనెల 7న సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో ఉపాధి హామీ, సెర్ప్‌ ఉద్యోగులతో మెదక్‌ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ ఛైర్మన్‌ రవీందర్‌ రెడ్డి, మరికొందరు నాయకులు రహస్యంగా సమావేశం నిర్వహించారు. ఈ విషయం కాస్తా బయటకు తెలియటంతో.. వెంకట్రామిరెడ్డి, రవీందర్‌ రెడ్డిపై కేసు నమోదైంది.


ఈ క్రమంలోనే సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా.. మీటింగ్‌లో పాల్గొన్న ఉద్యోగులను గుర్తించి.. వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెండైన వారిలో 38 మంది సెర్ప్‌ ఉద్యోగులు, 68 మంది ఉపాధి హామీ ఉద్యోగులు ఉన్నారు.


Latest News
 

కేటీఆర్ ను తప్పుడు కేసులో ఇరికించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు: బీఆర్ఎస్ Sun, Oct 27, 2024, 05:31 PM
పర్యాటకుల శుభవార్త.. పరవళ్లు తొక్కే కృష్ణమ్మ అలలపై సాగర్ టూ శ్రీశైలం థ్రిల్లింగ్ ప్రయాణం Sun, Oct 27, 2024, 04:42 PM
హైదరాబాద్ లో తొలి డబుల్‌ డెక్కర్, ఎలివేటెడ్‌ కారిడార్లు.. నిర్మాణంపై హెచ్ఎండీఏ కీలక నిర్ణయం Sun, Oct 27, 2024, 04:41 PM
జన్వాడ ఫాంహౌస్‌లో అర్ధరాత్రి పార్టీ.. పోలీసుల మెరుపు దాడి, డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ Sun, Oct 27, 2024, 04:39 PM
ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు.. డిసెంబర్ చివరి నాటికి, మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు Sun, Oct 27, 2024, 04:38 PM