రాత్రంతా బాధపడ్డా.. రెండు గలీజ్ మాటలు మాట్లాడతా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్

byసూర్య | Fri, Mar 29, 2024, 10:38 PM

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఓవైపు లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతుంటే.. మరోవైపు బీఆర్ఎస్ నేతలు పోటీ పడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. అయితే.. ఇన్ని రోజులు మాజీలు, చిన్న చిన్న నేతలు, కొందరు సిట్టింగులు పార్టీ వీడగా.. ఇప్పుడు పార్టీలో అగ్రనేతలుగా ఉన్న కొందరు నాయకులు కాంగ్రెస్ బాట పట్టటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అందులో.. రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి లాంటి సీనియర్ నేతలు పార్టీని వీడటంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. కష్టకాలంలో కేసీఆర్‌కు తోడుగా ఉండి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది పోయి.. ఇలాంటి సమయంలో పార్టీని వీడటంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.


హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ రావు పాల్గొన్నారు. అయితే.. "డాక్టర్ సాబ్ నువ్వు మెత్తగా మాట్లాడతావు.. కొంచెం గట్టిగా, కొన్ని గలీజ్ మాటలు మాట్లాడాలే అని చెప్తుంటారని.. అందుకే ఈరోజు రెండు గలీజ్ మాటలు మాట్లాడాలనుకుంటున్నా.. చేవెళ్ల కార్యకర్తలందరినీ చూసి నాకు ధైర్యం వచ్చింది. రాత్రి బాగా బాధపడ్డా.. వాళ్లు పెద్దమనుషులు అనబుద్ది కాదు కానీ.. అనాల్సి వస్తుంది. కేశవరావు ఏమో 85 ఏళ్లు, కడియం శ్రీహరి 70 ఏళ్లు అనుకుంటా. వాళ్లు పెద్దలు.. చాలా గౌరవిస్తుంటా. అంకుల్ అని, సార్ అని పిలుస్తుంటి.. కానీ ఇవాళ అంటున్న వాళ్ల గురించి.. సిగ్గూ లజ్జా లేని తెలంగాణ ద్రోహులు వాళ్లు. నేను ఎప్పుడూ గలీజ్ మాటలు మాట్లాడ మామూలుగా.. కానీ ఒకప్పుడు ఉద్యమకారులపై గన్ను ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డితో చేతులు కలిపిన వాళ్లను ఏమనాలో చెప్పండి." అంటూ సంజయ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తా అంటూ ప్రతిసారి రేవంత్ రెడ్డి అంటున్నారని.. సంజయ్ రావు గుర్తు చేశారు. కేసీఆర్ చరిత్ర చెరిపితే చెరిగిపోయేది కాదని.. ప్రతి తెలంగాణ బిడ్డ గుండె మీద రాసిన చరిత్ర అంటూ కల్వకుంట్ల సంజయ్ రావు చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు బతికున్నంత కాలం, గుండె కొట్టుకున్నంత కాలం కేసీఆర్ ఆనవాళ్లు ఉంటాయి, కేసీఆర్ పేరే వినిపిస్తుందంటూ సంజయ్ రావు చెప్పుకొచ్చారు.



Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM