byసూర్య | Sat, Mar 30, 2024, 09:08 AM
తెలంగాణలో రోజూరోజుకి ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో నిమ్మకాయల ధరలకు రెక్కలొచ్చాయి. కొద్ది రోజుల క్రితం వరకు అరడజను పెద్దసైజు నిమ్మకాయలకు రూ.20లకు విక్రయించగా.. ఇప్పుడు రూ.40-రూ.50కి అమ్ముతున్నారు. విడిగా అయితే పెద్దసైజు నిమ్మకాయ రూ.10, చిన్న సైజుదైతే రూ.5 చొప్పున విక్రయిస్తున్నారు. నిమ్మకాయల ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.