కేటీఆర్ చర్లపల్లిలో చిప్పకూడు తినాల్సిందే.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

byసూర్య | Fri, Mar 29, 2024, 10:36 PM

తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో వాల్మీకి బోయలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి.. ఫోన్ ట్యాపిం వ్యవహారంపై స్పందించారు. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తలు ఏం మాట్లాడుకున్నారో కూడా విన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతూ కొంతమంది ఫోన్లు ట్యాప్ చేశామని, అందులో తప్పేంటీ అంటూ కేటీఆర్ బరితెగించిన మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఒకవేళ అలా చేసి ఉంటే కేటీఆర్ చర్లపల్లి జైలులో చిప్పకూడు తినాల్సి వస్తుందంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు.


తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని.. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఫిర్యాదు చేశానని.. కానీ అధికారులు ఎవరూ పట్టించు కోలేదన్నారు రేవంత్ రెడ్డి. పొరపాట్లు చేయ్యొద్దని చెప్పినా.. అధికారులు వినిపించుకోకుండా ఫోన్లు ట్యాపింగ్ చేశారని.. ఇప్పుడు జైలుకు వెళ్తున్నారని చెప్పుకొచ్చారు. కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారని.. ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోవాలని హితవు పలికారు. కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్‌ను ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఎవరైనా.. వేరే వాళ్ల కుటుంబ సభ్యుల కాల్స్ వింటారా అని నిలదీశారు. భార్య, భర్తల మధ్య ఫోన్లు వినే దుర్మార్గానికి గత ప్రభుత్వం పాల్పడిందన్నారు. మంది సంసారాల్లో వేలు పెట్టి చూడాల్సిన అవసరం కేటీఆర్‌కు ఎందుకు వచ్చిందంటూ నిలదీశారు రేవంత్ రెడ్డి.


ఇదిలా ఉంటే.. తెలంగాణలో కాంగ్రెస్ వంద రోజుల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ సర్కార్ అమలు చేసిన పథకాలకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని తెలిపారు. ఢిల్లీలో ఇతర రాష్ట్రాల నేతలను కలిసినప్పుడు తెలంగాణ గురించి చర్చించుకుంటున్నారని వివరించారు. 100 రోజుల పాటు పూర్తిగా అభివృద్ధిపైనే దృష్టి సారించామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM