కారు అద్దాలు పగులగొట్టి.. క్షణాల్లో ఎలా దొంగతనం చేశాడో చూశారా

byసూర్య | Fri, Mar 29, 2024, 07:44 PM

 పట్టపగలే రోడ్డుపై కారు అద్దాలను ధ్వంసం చేసి 2 లక్షల రూపాయలు చోరీ చేశాడు. జనం తిరుగుతుండగానే.. క్షణాల్లో దొంగతనం చేసి పారిపోయాడు. జనగామ జిల్లా కేంద్రంలో పంజాబ్ బ్యాంక్ ఎదుట ఈ ఘటన చోటు చేసుకుంది. దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి ICICI బ్యాంకులో నుంచి రూ. 2 లక్షలు విత్‌డ్రా చేశారు. ఆ డబ్బును కారులోనే ఉంచి, పంజాబ్ బ్యాంకు ముందు కారు పార్క్ చేసి, బ్యాంకు లోపలికి వెళ్లారు. ఇంతలో ఓ దుండగుడు వచ్చి కారు అద్దాలను పగులగొట్టి దొంగతనం చేశాడు. క్యాష్ బ్యాగును తీసుకొని క్షణాల్లో అక్కడ నుంచి ఉడాయించాడు. చోరీ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.


Latest News
 

మంటల్లో చిక్కుకున్న 50 మందిని కాపాడిన బాలుడు.. సాహసం చేశావురా డింభకా Sat, Apr 27, 2024, 09:30 PM
మంచి వ్యక్తిని గెలిపించండి.. తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఏపీ టీడీపీ నేత ప్రచారం Sat, Apr 27, 2024, 09:22 PM
బంగారంలా మెరిసిపోతున్న స్మితా సబర్వాల్.. మేడం సర్ మేడం అంతే Sat, Apr 27, 2024, 09:20 PM
ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే Sat, Apr 27, 2024, 09:08 PM
తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. రెడ్‌, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ Sat, Apr 27, 2024, 09:04 PM