byసూర్య | Fri, Mar 29, 2024, 01:33 PM
శిశుమందిర్ పాఠశాలల్లో విద్యార్థులకు విభిన్నమైన విద్యాబోధన అందిస్తున్నామని ఉమ్మడి పాలమూరు జిల్లా సరస్వతి విద్య పీఠం కార్యదర్శి కుంటి ఎల్లప్ప అన్నారు. శుక్రవారం నారాయణపేట శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో విద్యార్థుల పేరెంట్స్ సమావేశం నిర్వహించారు. సమాజంలో వ్యక్తిగా మనుగడ సాధించేందుకు అవసరమైన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని విద్యార్థులకు అందిస్తున్నామని అన్నారు. పేరెంట్స్ నుండి సలహాలు స్వీకరించారు.