byసూర్య | Fri, Mar 29, 2024, 01:03 PM
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనాన్ని దొంగలించడానికి ప్రయత్నించిన దుండగుడిని గుర్తించడంతో పరారీ అయ్యాడు. దుండగుడు ద్విచక్ర వాహనాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ చౌక్ వద్ద నిలిపాడు. వెనక బాగాన ఉన్న నంబర్ ప్లేట్ ను విరగ్గొడుతుండగా చుట్టుపక్కల వారు గమనించి దుండగుడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. వెంటనే వాహనాన్ని అక్కడ నిలిపి పరారీ అయ్యాడు. వాహనం ఎవరిదో ఇంకా తెలియలేదు.