byసూర్య | Fri, Mar 29, 2024, 12:46 PM
నాగర్ కర్నూల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పైకా భవనంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని గురువారం అదనపు కలెక్టర్ సీతారామారావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రంలోనికి ఓటు హక్కు ఉన్న వారిని మాత్రమే అనుమతించాలని, సెల్ఫోన్లు, పెన్ను, ఇతర వస్తువులను పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించ కూడదని పోలింగ్ అధికారులకు సూచించారు.