byసూర్య | Fri, Mar 29, 2024, 12:04 PM
నల్లగొండ బార్ అసోసియేషన్ లో జరిగిన న్యాయవాదుల ఎన్నికలలో శుక్రవారం అధ్యక్షులుగా సిరిగిరి వెంకటరెడ్డి, కార్యదర్శిగా గిరి లింగయ్య, జాయింట్ సెక్రటరీగా ప్రమీల, ఇతర కార్యవర్గ సభ్యులు ఎన్నికైనారు. సందర్భంగా నూతనంగా అధ్యక్షునిగా ఎన్నికైన సిరిగిరి వెంకటరెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సభ్యులకు న్యాయవాదులు పూలమాలలతో అభినందించారు.