byసూర్య | Fri, Mar 29, 2024, 12:01 PM
నల్లగొండ వీటి కాలనీలో నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలని పూర్తి చేస్తామన్నారు. ఎంత వరకు పూర్తి చేశారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, నల్లమోతు భాస్కరరావు, భూపాల్ రెడ్డి, తదితరులున్నారు.