byసూర్య | Fri, Mar 29, 2024, 09:42 AM
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ను నేతలు వీడుతుండటంతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. 'అసాధ్యం అనుకున్న తెలంగాణను సాధించిన ధీశాలి మన కేసీఆర్. అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు. నిక్సారైన కొత్తతరం నాయకత్వం తయారు చేస్తా' అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.