byసూర్య | Fri, Mar 29, 2024, 09:25 AM
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ 2024-25 విద్యా సంవత్సరానికి మొదటి తరగతిలో ప్రవేశాల షెడ్యూల్ను విడుదల చేశాయి. ఈ అడ్మిషన్ల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 1 ఉదయం 10 గంటల నుండి ప్రారంభమవుతుంది.
దరఖాస్తు గడువు ఏప్రిల్ 15 సాయంత్రం 5 గంటలకు. 1వ తరగతిలో ప్రవేశం పొందాలనుకునే పిల్లల వయస్సు మార్చి 31, 2024 నాటికి ఆరేళ్లు నిండి ఉండాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ స్పష్టం చేసింది.
కేవీల్లో 1వ తరగతి సీటు కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారి మొదటి తాత్కాలిక జాబితా ఏప్రిల్ 19న విడుదల కానుంది. సీట్ల లభ్యతను బట్టి రెండో తాత్కాలిక జాబితాను ఏప్రిల్ 29న, మూడో తాత్కాలిక జాబితాను మేలో విడుదల చేస్తారు.