byసూర్య | Thu, Mar 28, 2024, 01:43 PM
మాతృ మరణాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత కలెక్టరేట్లోని తన చాంబర్ లో 2023లో మరణించిన మాతృమూర్తులపై వైద్యాధికారులతో సమీక్షించారు. 2023లో పెద్దపల్లి జిల్లాలో 6మంది మాతృమూర్తుల మరణాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.