వెలుగులోకి మరో స్కాం.. పిల్లలకు పంచే పాల స్కీంలో మహిళా అధికారి చేతివాటం

byసూర్య | Fri, Mar 01, 2024, 09:36 PM

రాష్ట్రంలో ఒకదాని వెంట ఇంకోటి అన్నట్టుగా కుంభకోణాలు బయటపడుతున్నాయి. మొన్న గొర్రెల పంపిణీ పథకంలో స్కాం.. నిన్న ఆవుల పంపిణీలో స్కాం.. రైతుబంధు, రైతు బీమా ఇలా ఏ పథకం పేరు చెప్పినా.. అందులో ఎక్కడో ఓ దగ్గర ఎవరో ఒక అధికారి చేతివాటం చూపించినట్టుగా బయటపడుతోంది. ఇన్ని రోజులు పెద్దలకు అందే పథకాల విషయంలో కొందరు అవినీతి అధికారులు చేతి వాటం చూపించగా.. ఇప్పుడు ఓ మహిళా అధికారిణి పిల్లలు పంచే పాల స్కీంలోనూ స్కాం చేసినట్టుగా వెలుగులోకి వచ్చింది.


ట్రైబల్ పిల్లలకు పాలు పంపిణీ చేసే ఆరోగ్యలక్ష్మీ పాల పథకంలో కుంభకోణం జరిగినట్టుగా ఏసీబీ గుర్తించింది. ఈ పథకానికి సంబంధించిన నిధులు పక్కదారి పట్టినట్టు అధికారులు తేల్చారు. అయితే.. ఈ స్కాం వెనుక ప్రస్తుతం హైద‌రాబాద్ చైల్డ్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రాజెక్టు అధికారిణిగా ఉన్న అనిశెట్టి శ్రీదేవి అని గుర్తించిన అధికారులు ఆమెను గురువారం రోజు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.


అయితే.. గతంలో ఆదిలాబాద్ జిల్లా జైనూరులో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓగా అనిశెట్టి శ్రీదేవి విధులు నిర్వర్తించగా.. ఆ సమయంలో నిధులు పక్కదారి పట్టించినట్టు అధికారులు తేల్చారు. ఆరోగ్యలక్ష్మీ పాల పథకంలో 65 లక్షల 78 వేల రూపాయల నిధులు గోల్ మాల్ అయినట్టు ఏసీబీ తెలిపింది. శ్రీదేవి పరిధిలో ఉన్న 322 అంగన్ వాడీ సెంటర్లకు పాలు పంపినట్లు నకిలీ ఇంటెండ్లను సృష్టించి.. రికార్డుల్లో పేర్కొన్నట్టు గుర్తించారు. 2015-2016లో ఈ కుంభకోణం జరిగిందని అధికారులు తేల్చారు. శ్రీదేవిని అరెస్ట్ చేసి కరీంనగర్ కోర్టులో హాజరపర్చి.. రిమాండ్‌కు తరలించారు.


Latest News
 

51 అడుగులకు చేరిన నీటిమట్టం Sat, Jul 27, 2024, 09:05 AM
రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM