byసూర్య | Fri, Mar 01, 2024, 03:16 PM
కల్లూరు మండలం నారాయణపురంలో మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా స్థానిక ఎమ్మెల్యే దృష్టిలో ఉంచాలని సూచించారు.
ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా ఏ పనులు జరగవని చెప్పారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రధాన సాగునీటి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి, తదితరులు పాల్గొన్నారు.