byసూర్య | Fri, Mar 01, 2024, 01:18 PM
నగరంలో సున్నా కరెంట్ బిల్లులకు రంగం సిద్ధమైంది. విద్యుత్తు బిల్లులతో ఆహార భద్రత(రేషన్) కార్డు అనుసంధానమైన వినియోగదారులకు గృహజ్యోతి వర్తించనుంది. 200 యూనిట్లలోపు విద్యుత్తు వాడకం ఉన్న అందరికీ ఈ నెల సున్నా బిల్లు రానుంది. ఈ మేరకు బిల్లింగ్ సాఫ్ట్వేర్లో మార్పులు చేశారు. అందుకోసం కొత్త బిల్లింగ్ యంత్రాలు కొనుగోలు చేశారు. వీటి పనితీరును ఇప్పటికే పరిశీలించినట్లు అధికారులు తెలిపారు.