షాకింగ్ ట్విస్ట్.. నిందితురాలిగా కవిత పేరు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం..!?

byసూర్య | Fri, Feb 23, 2024, 06:57 PM

దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో పాత్ర ఉందన్న ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఇప్పటివరకు కేవలం సమాచారం కోసం ఈడీ ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఎమ్మెల్సీ కవితను కూడా నిందితురాలిగా పరిగణిస్తున్న సీబీఐ.. కేసులో ఆమె పేరును చేర్చింది. ఈ మేరకు కవితకు సీబీఐ నోటీసులు కూడా జారీ చేసింది. 41 (ఏ) కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26న ఢిల్లీలోని సీబీఐ ఆఫీసుకు విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టంగా అధికారులు పేర్కొన్నారు.


అయితే.. సుమారుడు ఏడాదిన్నరగా సాగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో భాగంగా.. చాలా మందిని సీబీఐ, ఈడీ విచారిస్తూ వస్తున్నాయి. కాగా.. ఇప్పటికే కీలక నిందితులు అప్రూవర్లుగా మారిపోయారు. ఈ క్రమంలోనే.. నిందితులు ఇచ్చిన స్టేట్ మెంట్ల ఆధారంగా.. కవితకు సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. మాగుంట రాఘవ, శరత్ చంద్రా రెడ్డి, కవిత పీఏ అసోఖ్ కౌశిక్ ఇచ్చిన సమాచారంతో.. కవితకు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. దీంతో.. కవిత అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. విచారణకు హాజరైన తర్వాత.. అక్కడే సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. గతంలోనూ ఇలాంటి అరెస్టులు జరగ్గా.. మరి కవిత విషయంలో ఏం జరగనుందన్నది ఉత్కంఠగా మారింది.


కాగా.. ఈ కేసులో ఇప్పటికే కవితను ఈడీ అధికారులు పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రశ్నించిన సమయంలో రాత్రి 10 నుంచి పదకొండింటి వరకు.. సుమారు 6 నుంచి 8 గంటల సమయం విచారించారు. ఈ క్రమంలోనే.. తన దగ్గరున్న ఫొన్లను కూడా అధికారులకు హ్యాండోవర్ చేశారు. అయితే.. ఈడీ తనను రాత్రుళ్లు కూడా విచారించటంపై కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. కాగా.. విచారణ పూర్తియ్యే వరకు కవితపై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది.


మరోవైపు.. మధ్యలో ఈడీ నోటీసులు ఇవ్వగా.. తాను వేసిన పిటిషన్ మీద సుప్రీం కోర్టు నుంచి స్పష్టమైన తీర్పు వచ్చే వరకు తాను విచారణకు హాజరుకానని కవిత చెప్పేశారు. కాగా.. ఇప్పుడు సీబీఐ నోటీసులు పంపించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అందులోనూ.. లోక సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కవితకు నోటీసులు ఇవ్వటం.. అది కూడా ఆమె పేరును కేసులో నిందితురాలిగా చేర్చటం.. ఇప్పుడు బీఆర్ఎస్‌కు బిక్ షాక్. కాగా.. ఈ నోటీసులపై కవిత ఎలా స్పందించనున్నారన్ని ఉత్కంఠ రేకెత్తిస్తోంది.



Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM