![]() |
![]() |
byసూర్య | Fri, Feb 23, 2024, 04:13 PM
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 594 మందిపై సిటీ పోలీసు యాక్టు కింద కేసు నమోదు చేసినట్టు పోలీసు కమిషనర్ సునిల్ దత్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీసు యాక్టు అమల్లో ఉందని,
బహిరంగ మద్యపానం, ర్యాష్ డ్రైవింగ్, సమయానికి మించి షాపులు తెరవడం, బర్త్ డేల పేరుతో రోడ్లపై వాహనాలు అడ్డుపెట్టి ప్రజలకు అసౌకర్యం కలిగించే వారిపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరు పరుస్తామన్నారు.