byసూర్య | Fri, Feb 23, 2024, 03:38 PM
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం వేట కొనసాగుతుంది. గుర్తు తెలియని వ్యక్తులు పురాతన దేవాలయాలు, కోటలు, చారిత్రక ప్రదేశాల వద్ద తవ్వకాలు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలోని లోపలి భాగాలు, లోతట్టు ప్రాంతాల్లో ఈ తవ్వకాలు బాగా జరుగుతున్నాయి. గుప్త నిధుల తవ్వకాలలో అసాంఘిక కార్యక్రమాలు, క్షుద్ర పూజలు చేస్తున్నట్లు నల్లమల వాసులు శుక్రవారం ఆరోపించారు.