![]() |
![]() |
byసూర్య | Fri, Feb 23, 2024, 02:12 PM
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి బాధాకరమని నారాయణపేట నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి అన్నారు. ఆమె మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. యువ ఎమ్మెల్యేగా అనతి కాలంలోనే ప్రజల మన్ననలు పొందారని, ఆమె మరణం కంటోన్మెంట్ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు.