![]() |
![]() |
byసూర్య | Fri, Feb 23, 2024, 02:11 PM
దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 2024 నూతన సంవత్సర డైరీని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దివ్యాంగులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ. దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తానని దివ్యాంగులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.