ఎమ్మెల్యే లాస్య భౌతికకాయానికి కేసీఆర్ నివాళి

byసూర్య | Fri, Feb 23, 2024, 01:53 PM

ఎమ్మెల్యే లాస్య నందిత ఇంటికి మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. హైదరాబాద్ కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లిన కేసీఆర్ లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. లాస్య భౌతికకాయానికి నివాళులర్పించారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు హారీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.
అయితే ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఓఆర్ఆర్‌పై రెయిలింగ్‌ను ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని అంతా భావించారు. అయితే, వేగంగా వస్తున్న లారీ కారును ఢీకొని 100 మీటర్ల దూరం లాక్కిళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. కారును ఢీకొన్న లారీ ఆగకుండా వెళ్లిపోయింది. లారీని ఓవర్ టేక్ చేస్తుండగా కారు ప్రమాదానికి గురై రెయిలింగ్‌ను ఢీకొట్టిందని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) మృతి చెందారు. పటాన్చెరు ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ని ఢీకొట్టింది. 


Latest News
 

నిజామాబాద్ లో 9 మంది తహశీల్దార్ ల బదిలీ Sat, Jul 27, 2024, 02:26 PM
అమడబాకులలో పట్టపగలే చోరీ Sat, Jul 27, 2024, 02:25 PM
భార్యను చంపిన ఘటనలో వ్యక్తికి జీవిత ఖైదు Sat, Jul 27, 2024, 02:24 PM
జూరాల ప్రాజెక్టు జల సిరులు Sat, Jul 27, 2024, 02:20 PM
పంచాయతీల అభివృద్ధికి కేంద్రం నిధులే: కొండ ప్రశాంత్ రెడ్డి Sat, Jul 27, 2024, 02:18 PM