ఎమ్మెల్యే లాస్య భౌతికకాయానికి కేసీఆర్ నివాళి

byసూర్య | Fri, Feb 23, 2024, 01:53 PM

ఎమ్మెల్యే లాస్య నందిత ఇంటికి మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. హైదరాబాద్ కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లిన కేసీఆర్ లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. లాస్య భౌతికకాయానికి నివాళులర్పించారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు హారీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.
అయితే ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఓఆర్ఆర్‌పై రెయిలింగ్‌ను ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని అంతా భావించారు. అయితే, వేగంగా వస్తున్న లారీ కారును ఢీకొని 100 మీటర్ల దూరం లాక్కిళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. కారును ఢీకొన్న లారీ ఆగకుండా వెళ్లిపోయింది. లారీని ఓవర్ టేక్ చేస్తుండగా కారు ప్రమాదానికి గురై రెయిలింగ్‌ను ఢీకొట్టిందని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) మృతి చెందారు. పటాన్చెరు ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ని ఢీకొట్టింది. 


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM