byసూర్య | Wed, Feb 21, 2024, 10:12 AM
సిద్దిపేట పట్టణంలోని స్థానిక రైతు బజార్ నందు సిద్దిపేట, తోగుట, చిన్నకోడూరు, నంగునూర్ మండలాలకు చెందిన రైతులు తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరి రావు, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మంగళవారం సమావేశమైయ్యారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని వారి మేనిఫెస్టో రైతులకు భరోసా ఇచ్చిన పార్టీ అభ్యర్థులనే ఎన్నికల్లో గెలిపించుకొందామని ఏకగ్రీవ తీర్మానం చేశారు.