ఏసీబీ వలకు చిక్కిన మరో అవినీతి తిమింగలం.. రూ.65 లక్షలు, రెండున్నర కిలోల గోల్డ్ సీజ్

byసూర్య | Tue, Feb 20, 2024, 09:45 PM

మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వందల కోట్ల ఆస్తులు, భూములు అక్రమంగా కూడగట్టినందుకు ఆయన్ను అరెస్టు చేశారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదిలా ఉండగానే.. అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది.


బిల్లులు మంజూరు చేయడానికి లంచం తీసుకుంటూ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ఇంజినీర్‌ (ఎస్‌ఈ) జగజ్యోతి సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గంగన్న అనే కాంట్రాక్టర్‌ను నుంచి లంచం తీసుకుంటా పట్టుబడింది. గంగన్న గతంలో నిజామాబాద్‌లో పూర్తిచేసిన పనికి బిల్లు మంజూరవ్వగా.. హైదరాబాద్‌ శివార్లలోని గాజుల రామారంలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న జువైనల్‌ బాలుర వసతిగృహం కాంట్రాక్టునూ ఆయనే దక్కించుకున్నారు. నిజామాబాద్‌లో పూర్తయిన పనికి బిల్లులు మంజూరు చేయడం, గాజుల రామారం పనికి అంచనాలు సవరించేందుకుగాను ఎస్‌ఈ జగజ్యోతి లంచం డిమాండు చేశారు. దీంతో కాంట్రాక్టర్‌ గంగన్న ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.


అతడి ఫిర్యాదు మేరకు పక్కా స్కెచ్ వేసిన ఏసీబీ అధికారులు.. మాసబ్‌ ట్యాంక్‌లోని కార్యాలయంలో రూ.84 వేలు లంచం తీసుకుంటున్న జగజ్యోతిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఆమె ఆఫీసులోనూ.. కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి ఏసీబీ కోర్డులో హాజరుపరిచారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM