నేను ఎప్పుడు వెళ్లిపోతానా అని చూస్తున్నారు.. సొంత పార్టీ నేతలపై ఈటల కామెంట్స్

byసూర్య | Tue, Feb 20, 2024, 08:27 PM

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే కీలక నేతలు జంపింగ్ జపాంగులు కూడా ఊపందుకున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో కీలక నేతలు జంప్ అవుతుండగా.. బీజేపీ నుంచి కూడా చేరికలు ఉన్నాయన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులోనూ ప్రధానంగా.. బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ పార్టీ మారనున్నారన్న వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈటల బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరి.. కరీంనగర్ నుంచి ఎంపీగా బరిలో దిగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే.. ఈ వార్తలపై స్పందించిన ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు.


పార్టీలు మారడం అంటే బట్టలు మార్చుకున్నంత సులువు కాదని గతంలో చెప్పానని గుర్తు చేసిన ఈటల రాజేందర్.. తన లాంటి నాయకులు పార్టీలు మారితే ప్రజలు క్షమించరని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే.. తన సొంత పార్టీ నేతలపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు పార్టీని విడిచి వెళ్లిపోతానా ఎదురు చేసేవాళ్లు చాలా మంది ఉన్నారని కీలక కామెంట్ చేశారు ఈటల రాజేందర్.


మరోవైపు.. ఈటల ఘర్ వాపసీ అని బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంటే.. బీజేపీని వీడి కాంగ్రెస్‌లోకి వస్తున్నారని హస్తం నేతలు ప్రచారం చేస్తున్నారని రాజేందర్ దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్ అధికారంలో ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాపై ఎంత అహంకారంతో మాట్లాడారో తనకు ఇప్పటికీ కళ్ల ముందు కదులాడుతోందని చెప్పుకొచ్చారు.


బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు వార్తలపై కూడా స్పందించిన ఈటల రాజేందర్.. ప్రజాక్షేత్రంలో ఓడిపోయాక పొత్తులు అంటే ప్రజలు నవ్వుకుంటారన్నారు. నాలుగు ఓట్ల కోసం బీఆర్ఎస్‌తో బీజేపీ కలిసే ప్రసక్తే లేదని తేల్చేశారు. పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈటల వివరించారు.


అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్.. రెండు చోట్ల ఓడిపోవటంతో.. పార్టీ మారే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అందులోనూ.. ఇప్పుడు లోక్ సభ నుంచి పోటీ చేసేందుకు కూడా ఆయనకు అనుకూలమైన స్థానాల్లో బీజేపీ సీనియర్లు ఉండటం.. అధిష్ఠానం చెప్పిన స్థానాల్లో ఆయనకు ఆసక్తి లేకపోవటంతో పాటు కేడర్ కూడా అంతంతమాత్రంగానే ఉండటం కూడా ఈ వార్తలకు బలం చేకూరుతోంది.


వీటన్నింటికీ తోడూ.. ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో.. కాంగ్రెస్ నేతలతో భేటీ అయిన ఫొటో సోషల్ మీడియాలా వైరల్ అవుతుండటంతో.. ఈటల పార్టీ మార్పు ప్రచారం ఊపందుకుంది. కాగా.. ఈ వార్తలన్నింటికీ ఈటల ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ.. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. మరి ఈటల విషయంలోనూ చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM