byసూర్య | Sat, Dec 09, 2023, 11:21 AM
బీజేపీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాసేపట్లో సమావేశం కానున్నారు. శాసనసభా పక్ష నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజల అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అంశంపై ప్రకటన చేయనున్నారు. అసెంబ్లీ సెషన్స్ను బిజెపి బాయికాట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్గా ఉండటంపై ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్గా ఉంటే తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని రాజాసింగ్ చెబుతున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే మిగతా ఏడుగురు ఎమ్మెల్యేల అభిప్రాయాలను సైతం తీసుకొనున్న కిషన్ రెడ్డి విధాన పరమైన నిర్ణయం తీసుకోనున్నారు.