ఎంపీ పదవికి రాజీనామా చేసిన సీఎం రేవంత్ రెడ్డి

byసూర్య | Fri, Dec 08, 2023, 10:36 PM

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. లోక్ సభ సభాపతి ఓం బిర్లాతో రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. సభాపతితో సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల మాజీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా ఉన్నారు. సభాపతికి రాజీనామాను సమర్పించిన అనంతరం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ బయలుదేరుతున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. రేవంత్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కొత్త కేబినెట్‌లో శాఖల కేటాయింపు, మరో ఆరుగురు కేబినెట్ ఎంపికపై చర్చించేందుకు రేవంత్ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు.



Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM