ప్రజా దర్బార్‌కు భారీగా తరలివచ్చిన ప్రజలు.. ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేసిన సీఎం

byసూర్య | Fri, Dec 08, 2023, 08:42 PM

జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా పేరు మారిన (ప్రగతి భవన్‌లోకాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం మొదటి ప్రజా దర్బార్ నిర్వహించింది. ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే దీనిపై రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. జ్యోతిరావు పూలే భవన్‌లో ప్రజా దర్బారు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. సీఎం నిన్నటి ప్రకటనతో తమ సమస్యలను చెప్పుకోడానికి ప్రగతి భవన్‌కు ప్రజలు భారీగా తరలివచ్చారు.


కొండపోచమ్మ ముంపు బాధితులు సీఎంను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. పరిహారం, పునరావాసం కల్పించలేదని సీఎంకి విన్నవించారు. వారి సమస్యను విన్న రేవంత్.. అధికారులతో చర్చించి పరిష్కరిస్తానని హమీ ఇచ్చారు. ముఖ్యమంత్రిని కలిసిన ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు.. జేఈ ఉద్యోగ నియమాక పరీక్షను వాయిదా వేయాలని ఆయన కోరారు.


ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను సీఎం స్వీకరిస్తున్నారు. ప్రజా దర్బారులో వచ్చిన ప్రతీ ఫిర్యాదును పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. 20 మంది సిబ్బందిని నియమించారు. వినతులను సంబంధిత జిల్లా కలెక్టర్లు, శాఖలకు సీఎం సిఫార్సు చేస్తున్నారు. ప్రజా దర్బారులో వచ్చిన ఫిర్యాదులను ప్రతి నెల సమీక్షించనున్నారు.


ప్రజా దర్బారు ముగిసిన అనంతరం ప్రజా భవన్ నుంచి సీఎం సెక్రటేరియట్‌కు పయనమ్యారు. అక్కడ విద్యుత్, రవాణ శాఖలపై సమీక్షించనున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణంపై రివ్యూ నిర్వహించి, ఇవాళ మార్గదర్శకాాలను విడుదల చేయనున్నారు.


గురువారం జరిగిన తొలి క్యాబినెట్‌లో విద్యుత్ బకాయిలు రూ.85 వేలు కోట్లు ఉన్నట్టు అధికారులు వివరించారు. దీంతో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించవద్దని సూచించారు. శుక్రవారం జరిగే సమీక్షకు ఆయనను రావాల్సిందేనని స్పష్టం చేశారు.


ప్రగతి భవన్ ఇనుప కంచెలు బద్దలు కొట్టామని.. శుక్రవారం ఉదయం అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ప్రకటించారు ప్రగతి భవన్ పేరుని జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా మారుస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ప్రగతి భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, తెలంగాణ కుటంబసభ్యులు ఎప్పుడు రావాలన్నా వచ్చి సమస్యలు చెప్సుకోవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఆలోచనను మిళితం చేస్తానని.. మీ అభిమాన నాయకుడిగా, మీ రేవంతన్నగా మీ మాట నిలబెడతానని భరోసా ఇచ్చారు. తెలంగాణ రైతాంగం, నిరుద్యోగుల కోసం ప్రభుత్వం పనిచేస్తుందని... ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు. కాగా, ఈ దర్బారులో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మిగతా మంత్రులు పాల్గొంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ తొలి అడుగు అని కాంగ్రెస్ సర్కారు పేర్కొంది.


Latest News
 

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Mon, Sep 16, 2024, 10:09 PM
రాజీవ్ గాంధీ లేకపోతే సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో ఛాయ్, సమోస అమ్ముకునేటోనివి: రేవంత్ రెడ్డి Mon, Sep 16, 2024, 10:05 PM
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఈటల Mon, Sep 16, 2024, 09:58 PM
హైదరాబాద్‌లో లక్ష గణపతి విగ్రహాల నిమజ్జనం.. ఆమ్రపాలి కీలక సూచనలు Mon, Sep 16, 2024, 09:49 PM
కళ్లుచెదిరిపోయేలా ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం. Mon, Sep 16, 2024, 09:45 PM