దుర్గం చెరువులో వేలాది చేపల మృత్యువాత,,,,ఆందోళన చెందుతున్న పలువురు నెటిజన్లు

byసూర్య | Wed, Dec 06, 2023, 09:31 PM

హైదరాబాద్‌లో పర్యాటక ప్రాంతమైన దుర్గం చెరువులో చేపలు మృత్యువాత పడుతున్నాయి. వేలాదిగా చేపలు చనిపోయి నీటిపై తేలియాడుతున్నాయి. మరికొన్ని చేపలు ఆక్సిజన్ ఆందక నీటిపైకి వచ్చి ఊపిరి పీల్చుకుంటున్నాయి. దీనిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేపల మృత్యువాతపై సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. చెరువులోని నీటిని పరీక్షించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు.


కారణం అదేనా..?


దుర్గం చెరువు ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నట్లు మహీంద్ర యూనివర్సిటీ అండ్ ఐఐటీహెచ్ టీమ్ గతంలోనే తెలిపింది. ఈ చెరువు ఇప్పుడు వ్యర్థాలు, కాలుష్యంతో నిండిపోయినట్లు స్టడీ చేసింది. దుర్గంలో చెరువులో వివిధ కంపెనీల నుంచి వస్తున్న కెమికల్స్ కలవడంతో నీరు డేంజర్‌గా మారిందని పేర్కొన్నారు. చెరువు నీటిలో ఇప్పటికే ఆక్సిజన్ శాతం భారీగా తగ్గిపోయింది. చేపలు, కప్పలు, ఇతర జలచరాలు దుర్గం చెరువులో బతుకలేకపోతున్నాయి. చెరువు నీటిలో యాంటి డిప్రెసెంట్స్, పెయిన్కిల్లర్స్, యాంటి ఒబెసిటీ మెడిసిన్స్, వెయిట్ లాస్ తగ్గించే మెడిసిన్‌తో పాటు కొకైన్ వంటి విషపూరిత పదార్థాలు ఉన్నట్లు వారు చేసిన స్టడీలో తేలింది.


చెరువులోని నీటి శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేయగా అందులో 183 రకాల సేంద్రియ సూక్ష్మ కాలుష్య కారకాలు ఉన్నట్లు గుర్తించారు. ఫార్మాస్యూటికల్స్, హెర్బిసైడ్లు, శిలీంద్ర సంహరిణులు, పురుగు మందులు, యూవీ ఫిల్టర్లు, స్టాస్టిసైజర్లు, సైనోటాక్సిన్లు, హార్మోన్లు, స్టెరాయిడ్లు, మెటాబోలైట్లు లాంటివి ఉన్నట్లు తేల్చారు. 50శాతం ఫార్మాస్యూటికల్స్, 9 శాతం మెటాబోలైట్లు, 8 శాతం హెర్బిసైడ్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇవి నీటిలోని జీవులకు ప్రమాదరమని.. వాటి వల్లే చేలలు చనిపోతున్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM