byసూర్య | Wed, Dec 06, 2023, 02:40 PM
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీ నుంచి బెంగళూరు బయల్దేరారు. డీకే రేపు సీఎం ప్రమాణస్వీకారానికి హైదరాబాద్ కు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ." సీఎల్పీ సమావేశంపై అధిష్టానానికి రిపోర్ట్ ఇచ్చాం. మంత్రి వర్గంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. కేబినెట్ బెర్తులపై హైకమాండ్ నిర్ణయిస్తుంది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడమే మా ఎజెండా. ప్రజలు మాకు అధికారం అప్పగించారు. వారికి మంచి పాలన అందిస్తాం అని డీకే శివకుమార్ అన్నారు.