తుఫానుపై అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు

byసూర్య | Tue, Dec 05, 2023, 08:13 PM

మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణలో పలు జిల్లాల్లో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచిస్తూ ట్వీట్ చేశారు. వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని ఆదేశించారు. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌కు అభిమానులు, కార్యకర్తలు స్పందిస్తున్నారు. ‘సీఎం ఆన్ డ్యూటీ’, ‘కంగ్రాట్స్ సీఎం సాబ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి అధికారిక ప్రకటన రాక ముందే రేవంత్ రెడ్డి ఈ ట్వీట్ చేయడం గమనార్హం. దీంతో అభిమానులు అభినందనలు తెలుపుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM