తుఫానుపై అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు

byసూర్య | Tue, Dec 05, 2023, 08:13 PM

మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణలో పలు జిల్లాల్లో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచిస్తూ ట్వీట్ చేశారు. వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని ఆదేశించారు. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌కు అభిమానులు, కార్యకర్తలు స్పందిస్తున్నారు. ‘సీఎం ఆన్ డ్యూటీ’, ‘కంగ్రాట్స్ సీఎం సాబ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి అధికారిక ప్రకటన రాక ముందే రేవంత్ రెడ్డి ఈ ట్వీట్ చేయడం గమనార్హం. దీంతో అభిమానులు అభినందనలు తెలుపుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM