సీఎం కావటానికి సహకరించాలని...జగన్‌కు రేవంత్ రెడ్డి ఫోన్ కాల్.. సోషల్ మీడియాలో వార్త వైరల్

byసూర్య | Tue, Dec 05, 2023, 07:18 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో అధికారాన్ని చేపట్టబోతుంది. అయితే రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. సీఎం రేసులో టీసీసీసీ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కీలక నేత కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లోని అత్యధిక ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి వైపు మొగ్గు చూపినా.. అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాలేదు. ఇవాళ సీఎం ఎవరనేది తేల్చే అవకాశం ఉంది.


అయితే.. తెలంగాణ సీఎంను డిసైడ్ చేసేది ఏపీ సీఎం జగన్ అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇక్కడ రేవంత్ సీఎం కావాలంటే జగన్ ఆశీస్సులు ఉండాల్సిందేనని ఓ వర్గం వారు ప్రచారం చేస్తున్నారు. దానికి కారణాలు కూడా ఉదహరిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు జగన్‌కు చాలా సన్నిహితులు. పొంగులేటి జగన్ ఆశీస్సులతో రాజకీయాల్లోకిరాగా, కోమటిరెడ్డి దివంగత వైఎస్ ఆశీస్సులతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఇప్పటికీ వారు వైఎస్ కుటుంబానికి విధేయులుగా ఉన్నారు.


కాంగ్రెస్ పార్టీ మెుత్తం 64 స్థానాల్లో విజయం సాధించగా.. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఆ పార్టీ 20 సీట్లు కైవసం చేసుకుంది. ప్రభుత్వం అధికారంలోకి రావటంలో ఇక్కడి సీట్లు కీలకం. ఖమ్మంలో పొంగులేటి, నల్గొండలో కోమటిరెడ్డి బలమైన నేతలు. జిల్లా రాజకీయాలను వీరు శాసిస్తారనే పేరుంది. దీంతో వీరు కూడా సీఎం రేసులోకి వచ్చారు. ఎక్కువ సీట్లు గెలిపించాం కాబట్టి మాకూ సీఎంగా అవకాశం కల్పించాలని వీరిద్దరూ కోరుతున్నారట. ఇప్పుడిదే విషయాన్ని ఓ వర్గం వారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.


రేవంత్ సీఎంగా ఎంపిక కావాలంటే.. జగన్ ఆశీస్సులు ఉండాలని చెబుతున్నారు. జగన్ చెబితే కోమటిరెడ్డి, పొంగులేటి వింటారని.. తమ నిర్ణయాన్ని మార్చుకొని వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందనేది వారి వాదన. ఇంకొందరైతే ఏకంగా రేవంత్ రెడ్డే జగన్‌కు కాల్ చేసి తనకు సపోర్టు చేయాలని.. కోమటిరెడ్డి, పొంగులేటిని బుజ్జగించాలని చెప్పినట్లుగా కూడా ప్రచారం చేస్తున్నారు. దీనిని కొందరు కొట్టిపారేస్తున్నారు. జగన్ చెబితే పొంగులేటి, కోమటిరెడ్డి ఎందుకు వింటారని ప్రశ్నిస్తున్నారు. గతంలో జరిగిన విషయాలను ప్రస్తావిస్తున్నారు.


పొంగులేటి వైసీపీకి గుడ్‌బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరే సమయంలో జగన్‌కు చెప్పలేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరే సమయంలోనూ ఏపీ సీఎంకు చెప్పలేదు. గతంలో పొంగులేటి ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు కూడా. తన పొలిటికల్ కెరీర్‌ కోసం.. మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా పొంగులేటి అడుగులు వేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో ఆయన ఆ పార్టీ వైపు మెుగ్గు చూపారు. ఇక కోమటిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉన్నా.. వైఎస్ మరణం తర్వాత జగన్‌తో టచ్‌లోకి వెళ్లలేదు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆయన్ను కలిసిన సందర్భాలూ లేవు. అలాంటప్పుడు జగన్ చెబితే కోమటిరెడ్డి, పొంగులేటి ఎలా వింటారని ప్రశ్నిస్తున్నారు.


తెలంగాణ సీఎం ఎవరో డిసైడ్ చేయాల్సింది కాంగ్రెస్ హైకమాండ్. గత పొరపాట్లకు తావులేకుండా ఈసారి ఆ పార్టీ పక్కా వ్యూహాలతో మెజార్టీ స్థానాలను దక్కించుకుంది. సీనియర్లు తమవారికే సీట్లు ఇవ్వాలని పట్టుబట్టినా.. సర్వేలు, స్థానికంగా ఉన్నా బలాబలాలను బట్టే అభ్యర్థులను ఎంపిక చేశారు. అందువల్లే కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకుందనేది రాజకీయ విశ్లేషకుల వాదన. ఈ నేపథ్యంలో పొంగులేటి, కోమటిరెడ్డి వల్లే కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చాయనుకోవటం సరైంది కాదని.. తెలంగాణ సీఎంను ఏపీ సీఎం జగన్ డిసైడ్ చేస్తారనటం మూర్ఖత్వమే అవుతుందని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM