byసూర్య | Tue, Dec 05, 2023, 11:51 AM
మీచౌంగ్ తుఫాను ప్రభావం వ్యవసాయం, విద్య, రవాణాలపైనే కాకుండా పలు ఉత్పత్తి రంగాలపైనా కూడా పడుతోంది. భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. తుఫాను కారణంగా ఇల్లెందు సింగరేణి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కోయగూడెం ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. మొత్తం 35వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు ఆగిపోయాయి.