byసూర్య | Tue, Dec 05, 2023, 09:09 AM
తుఫాను ప్రభావం పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కామేపల్లి ఏవో తారాదేవి మంగళవారం కోరారు. తుఫాను ప్రభావంతో కామేపల్లి మండలంతో పాటు జిల్లాలో రాగల మూడు రోజులు ఆకాశం మేఘావృతమై ఉండి తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ తుఫాను ప్రభావంతో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.