byసూర్య | Tue, Dec 05, 2023, 09:02 AM
ఈ ఏడాది అక్టోబరులో నిర్వహించిన ఓపెన్ టెన్త్, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు సంబంధించిన పరీక్షా ఫలితాలను సోమవారం విడుదల చేశారని ఖమ్మం డీఈవో సోమశేఖరశర్మ తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 411 మంది పదోతరగతి పరీక్షలకు హాజరవగా, 148 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. అలాగే ఇంటర్లో 429 మంది పరీక్షలకు హాజరుకాగా 199మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. పరీక్ష ఫలితాలను వెబ్ సైట్ లో చూసుకోవచ్చునని తెలిపారు.