byసూర్య | Tue, Dec 05, 2023, 08:59 AM
తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రశాంత పాలన అందించడం, ప్రజల అభివృద్ధే యజ్ఞంగా భావించి పనిచేశానని, ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో తన వంతు బాధ్యత ఉందని ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అన్ని వర్గాల ప్రజలు తన గెలుపు కోసం కృషి చేశారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తనకు ఓటు వేశారని, వారి నమ్మకాన్ని తాను విస్మరించనన్నారు.