byసూర్య | Tue, Dec 05, 2023, 08:57 AM
మిచౌంగ్ తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ జిల్లాకు రెడ్అలర్ట్ ప్రకటించినందున మంగళవారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. వచ్చే రెండు రోజుల్లో జిల్లాలో మోస్తరు నుండి భారీవర్షాలు పడే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు హాస్టల్ విడిచి బయటకు రాకూడదని సూచించారు. సహాయానికి జిల్లా కంట్రోల్ రూం 1077, 9063211298 కు సంప్రదించాలన్నారు.