byసూర్య | Tue, Dec 05, 2023, 08:54 AM
ప్రజావాణి కి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. సోమవారం నాగర్ కర్నూల్ ఎస్పీ ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి ముగ్గురు పిర్యాదారులు వచ్చారు. ఫిర్యాదారులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆయా ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.